వైయస్ జగన్‌పై గెలుపునకు ఢిల్లీలో సిఎం కిరణ్ వ్యూహం: ఆజాద్‌తో భేటీ

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజాగా గడుపుతున్నారు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెసు పార్టీ గెలుపు కోసం దేశ రాజధానిలో కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి పార్టీ నేతలతో వ్యూహాలు రచిస్తున్నారు. జగన్‌పై పై చేయి సాధించి జిల్లాలో కాంగ్రెసు పట్టు నిలబెట్టడంతో పాటు, జగన్ ఇమేజ్‌ తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సిఎం కిరణ్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాంనబీ ఆజాద్‌తో బుధవారం భేటీ అయ్యారు. కడప, పులివెందుల ఎన్నికలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.

జగన్‌కు సెంటిమెంటు కలిసి వస్తున్నందున కాంగ్రెసు పార్టీ ఏదో ఒక స్థానం నుండి గెలుపొందేందుకు గట్టిగా ప్రయత్నాలు చేసే దిశలో వారు యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ పార్టీ రెండు స్థానాలలో ఓడినప్పటికీ జగన్ మెజార్టీని భారీగా తగ్గించాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. మెజార్టీ తగ్గించడం ద్వారా అయినా జగన్ ఇమెజ్ డామేజ్ చేయవచ్చని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సిఎంకు కూడా అదే విషయాన్ని చెప్పినట్టుగా సమాచారం. ప్రధానంగా జగన్ మెజార్టీ తగ్గించేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది.

ఆజాద్‌తో భేటీ అనంతరం సిఎం అహ్మద్ పటేల్‌తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే భేటీ కావాల్సి ఉన్నప్పటికీ అహ్మద్ పటేల్ నుండి పిలుపు రాక పోవడంతో వేచి చూస్తున్నారు. ఆ తర్వాత ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కూడా కలిసి ఉప ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా ప్రధానంగా ఉప ఎన్నికలలో వ్యూహం కోసం వెళ్లినప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై కూడా కిరణ్ కేంద్ర ప్రతినిధిలతో చర్చించినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+