ధర్మానకు షాక్, వైయస్ జగన్ వైపు చూస్తున్న సోదరుడు కృష్ణదాసు

కడప ఉప ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని కృష్ణదాసు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కృష్ణ దాసు తన వైవు వస్తే ఆయన భార్య పద్మ ప్రియను శ్రీకాకుళం జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవి అప్పగిస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఓదార్పు యాత్ర సందర్భంగా నర్సీపట్నంలో పద్మ ప్రియ వైయస్ జగన్ను కలిశారు. గత మూడు నెలలుగా ప్రియతో పాటు ఆమె కుమారుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు.
కృష్ణదాసుతో పాటు కాంగ్రెసు టెక్కలి శాసనసభ్యురాలు కొర్ల భారతి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పలవాస కరుణాకర్ కూడా ఏప్రిల్ 27వ తేదీన వైయస్సార్ కాంగ్రెసులో చేరుతారని చెబుతున్నారు. నర్సీపట్నం కాంగ్రెసులో ఇప్పటికే కాంగ్రెసుకు, వైయస్సార్ కాంగ్రెసులో స్పష్టమైన చీలిక వచ్చింది.












Click it and Unblock the Notifications