జగన్ అత్యంత అవినీతిపరుడు, ఆస్తుల కోసమే పదవిపై కన్ను: యాష్కీ

మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ఎవరి ఒత్తిళ్లకు లొంగి జగన్ను పక్కన పెట్టారో బహిర్గతం కావాలన్నారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఆ విషయాన్ని బయట ప్రజలకు తెలియజేయాలన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలపై తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ ఫ్రంట్గా ఏర్పడి పోరాటం చేయాలని సూచించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని ఎవరైనా విమర్శిస్తే మంత్రులు స్పందించాలని సూచించారు. కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై తెలంగాణకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications