వైయస్ వివేకాను సిఎం చేస్తారని భయపడి జగన్ రాజీనామా: ఉండవల్లి

వైయస్సార్ సతీమణి విజయమ్మను కాంగ్రెసు నాయకులు ఎవరూ విమర్శించలేదని, వైయస్ జగన్ ఓదార్పు యాత్రను కాంగ్రెసు వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఓదార్పు యాత్రపై జగన్ తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ మరణంపై అనుమానాలుంటే వైయస్ జగన్ పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించలేదని ఆయన అడిగారు. జగన్ రాజకీయ క్రీడ ఆడున్నాడని ఆయన విమర్శించారు. జగన్ తన తల్లిని ఎండలో తిప్పడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓదార్పు యాత్ర కాంగ్రెసుకు ఉపయోగపడుతుందనే భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని తాను పల్లెత్తు మాట అనలేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణానికి తాను ఎందుకు సమాధానం చెప్పాలని, వైయస్ కుమారుడిగా అడిగే బాధ్యత వైయస్ జగన్కు లేదా అని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినవారిని తాను అడ్డుకున్నానని ఆయన అన్నారు. వైయస్సార్ ఆశయాల మేరకే తాను కాంగ్రెసులో కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications