ఆరేళ్ల బాలుడిని మూడు రోజులు నిర్బంధించిన స్కూల్ యాజమాన్యం

తమకు ఇంకా 8 వేల రూపాయల ఫీజు బాకీ ఉన్నారని, ఆ మొత్తాన్ని చెల్లించే వరకు బాలుడిని మీతో పంపబోమని యాజమాన్యం తనతో చెప్పి తన కుమారుడిని నిర్బంధించారని ఆల్వాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలుడిని పోలీసు స్టేషన్కు తెచ్చారు. పాఠశాలకు చెందిన ఇద్దరు యాజమన్య ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాము బాలుడిని నిర్బంధించలేదని, తాము బాలుడిని తీసుకుని వెళ్లాలని చెప్పినా తల్లిదండ్రులకు చెప్పినా వినలేదని పాఠశాల యజమాని భూపతిరెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications