సమైక్య రాష్ట్రానికి సిఎం కావాలని కెసిఆర్ ప్రయత్నాలు: రేవంత్ రెడ్డి

కడప ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లడాన్ని తప్పుపట్టడాన్ని ఆయన ఖండించారు. పార్టీ ఆదేశాల మేరకు నడుచుకోవాలని అలా నడుచుకోని వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కోరతానని సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. నాగం ఇటీవల కడప ప్రచారానికి వెళ్లిన టిడిపి నేతలను తప్పు పట్టారు. పార్టీకి ఎవరూ అతీతులు కాదని అన్నారు. పార్టీ వెళ్లమని ఆదేశిస్తే వెళ్లవలసిందే అని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం వ్యతిరేకం కాదని అన్నారు. కాబట్టి పార్టీ ఆదేశాలు పాటించాల్సిందేనని చెప్పారు.
ఒకవేళ ఎవరైనా కడప ఉప ఎన్నికలకు వెళ్లడాన్ని తప్పుపడితే వారు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చినట్టేనని అన్నారు. తెలంగాణలో కోట్లాది రూపాయల భూములను, రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ను గెలిపించే ఉద్దేశ్యంలో అలా మాట్లాడినట్టు భావించవలసి ఉంటుందని అన్నారు. జగన్కు మద్దతు ఇచ్చే విధంగా ఎవరూ మాట్లాడకూడదని హెచ్చరించారు.
కాగా త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయమని మరో సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం అటు యుపిఏ ప్రభుత్వంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ముసలం ఖాయమని చెప్పారు. కె చంద్రశేఖరరావు ఆంధ్ర ప్రదేశ్ సమైక్య రాష్ట్రానికి సిఎం కావాలని అభిప్రాయ సేకరణ చేస్తున్నారని ఆరోపించారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications