ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, వినాయక్ సేన్కు సుప్రీంకోర్టు బెయిల్
వినాయక్ సేన్కు బెయిల్ ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తిరిగి వినాయక్ సేన్ను అదుపులోకి తీసుకునేందుకు సరైన సాక్ష్యాధారాలు చూపాలని ఆదేశించింది. వినాయక్ సేన్ రాజద్రోహానికి పాల్పడినట్లు ప్రభుత్వం చేసిన ఆరోపణను కూడా సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. మావోయిస్టుల సాహిత్యం ఉన్నంత మాత్రాన వినాయక్ సేన్ నక్సలైట్ కార్యకలాపాలతో సంబంధాలు కలిగి ఉన్నాడని చెప్పలేమని స్పష్టం చేసింది.
తన బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ ఛత్తీస్ఘడ్ హైకోర్టు ఫిబ్రవరి 10వ తేదీన జారీ చేసిన ఆదేశాలను వినాయక్ సేన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనపై సరైన సాక్ష్యాధారాలు లేకుండానే తనను కింది కోర్టు దోషిగా ప్రకటించిందని సేన్ ఆరోపించారు. సేన్ బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ ఆయనకు మావోయిస్టులతో లోతైన సంబంధాలున్నాయని ఛత్తీస్ఘడ్ ప్రభుత్వం అఫడవిట్ దాఖలు చేసింది. వినాయక్ సేన్ ప్రస్తుతం ఛత్తీస్ఘడ్ రాజధాని రాయపూర్ జైలులో ఉన్నారు .