భార్య, వదినలను నరికి చంపిన ఉన్మాది: తాను ఆత్మహత్య

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వరకు ఆయన ఊళ్లో లేరని తెలుస్తోంది. అయితే ఊరిలోకి వచ్చిన తర్వాత ఆస్తి వివాదంపై కాస్త ఘర్షణ జరిగి ఆ తర్వాత సద్దుమణిగినట్లుగా తెలుస్తోంది. అయితే గురువారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సత్యనారాయణ తన భార్య వరలక్ష్మి, అత్త మంగతాయారు, వదిన సీత, మరో వదినను కూడా కత్తితో నరికి చంపారు. వారిని చంపిన అనంతరం సత్యనారాయణ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో అరుపులు వినబడటంతో స్థానికులు వెళ్లి చూశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కాగా మెదక్ జిల్లా అల్లాదుర్గంలో తగాదాల కారణంగా తన భార్యను నరికి తాను ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన గురువారం చోటు చేసుకుంది. వీరి మృతికి కుటుంబ తగాదాలే కారణం అని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications