రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్య, వదినలను నరికి చంపిన ఉన్మాది: తాను ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

East Godavari
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఉన్మాది తన భార్యను, వదిలను, అత్తను నరికి చంపిన దుర్ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. జిల్లాలోని గోకవరం మండలం తిరుమలాయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన సత్యనారాయణకు అదే గ్రామానికి చెందిన వరలక్ష్మితో కొన్నెళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే కొన్ని రోజులుగా ఆ కుటుంబంలో ఆస్తి వివాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వరకు ఆయన ఊళ్లో లేరని తెలుస్తోంది. అయితే ఊరిలోకి వచ్చిన తర్వాత ఆస్తి వివాదంపై కాస్త ఘర్షణ జరిగి ఆ తర్వాత సద్దుమణిగినట్లుగా తెలుస్తోంది. అయితే గురువారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సత్యనారాయణ తన భార్య వరలక్ష్మి, అత్త మంగతాయారు, వదిన సీత, మరో వదినను కూడా కత్తితో నరికి చంపారు. వారిని చంపిన అనంతరం సత్యనారాయణ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో అరుపులు వినబడటంతో స్థానికులు వెళ్లి చూశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

కాగా మెదక్ జిల్లా అల్లాదుర్గంలో తగాదాల కారణంగా తన భార్యను నరికి తాను ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన గురువారం చోటు చేసుకుంది. వీరి మృతికి కుటుంబ తగాదాలే కారణం అని తెలుస్తోంది.

English summary
A man killed his wife, aunty and sister-in-law thursday midnight. He suicide him self after killing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X