ఎమ్మెల్యేలతో ఇడుపులపాయలో వైయస్ జగన్ రహస్య సమావేశం

YS Jagan
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప లోకసభ అభ్యర్థి వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం తన వర్గానికి చెందిన శాసనసభ్యులతో సమావేశమయ్యారు. తన స్వగ్రామం ఇడుపులపాయలో ఆయన వారితో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 13 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు. కడప లోకసభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో జగన్ శాసనసభ్యులతో చర్చించినట్లు సమాచారం.

కాగా, జగన్ లోకసభ స్థానానికి శుక్రవారం నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి రోజా, కొండా సురేఖ, పుల్లా పద్మావతి వంటి నాయకులతో పాటు శాసనసభ్యులు కూడా హాజరయ్యారు. శనివారం పులివెందుల స్థానానికి వైయస్ విజయమ్మ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బద్వేలు శాసనసభ్యురాలు తిరిగి కాంగ్రెసు వైపు వెళ్లిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా జగన్ శాసనసభ్యులతో చర్చించినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమపై వస్తున్న విమర్సలను తిప్పి కొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+