కెసిఆర్పై దుమ్మెత్తి పోసిన ఎర్రబెల్లి, బండారం బయటపెడతానని హెచ్చరిక

కెసిఆర్ కూతురు కవిత, కుమారుడు కెటి రామారావు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ బండారం బయటపెడతామని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేసి తమ నాయకుడు చంద్రబాబు జైలుకు వెళ్లారని, కెసిఆర్ ఒక్క రోజు కూడా జైలుకు వెళ్లలేదని, పోలీసు దెబ్బ తినలేదని ఆయన అన్నారు. త్యాగాలు చేసినవారిని విస్మరించి ఏ త్యాగాలు చేశారని కెటి రామారావుకు సిరిసిల్ల టికెట్ ఇచ్చారని ఆయన అడిగారు. కెసిఆర్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు.
2009 ఎన్నికల్లో తాము కెసిఆర్తో పొత్తు పెట్టుకోవడం వల్లనే ఓడిపోయామని ఆయన చెప్పారు. విద్యార్థుల త్యాగాలను కెసిఆర్ కుటుంబం సొమ్ము చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కెటి రామారావుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కెటి రామారావుకు తమను విమర్సించే హక్కు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications