అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదు: సత్య సాయిబాబా భక్తుడు శ్యాంసుందర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం‌: సత్య సాయిబాబా విషయంలో తాను ఎవరి మీద కూడా ఫిర్యాదు చేయలేదని సత్య సాయిబాబా భక్తుడు శ్యాంసుందర్ స్పష్టం చేశారు. సాయిబాబా విషయంలో తాను ఇంతకు ముందు ఏ విధమైన లేఖ రాయలేదని కూడా ఆయన చెప్పారు. సత్యజిత్ అనే వ్యక్తిగత సహాయకుడు సత్య సాయిబాబాను మోసం చేస్తున్నాడని, సత్య సాయిబాబాకు చికిత్స కూడా చేయించలేదని శ్యాంసుందర్ లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శ్యాంసుందర్ ఆ ప్రకటన చేశారు. తాను ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదని చెబుతూ శ్యాంసుందర్ తమ కార్యాలయానికి లేఖను సాయి యజుర్మందిర్ నుంచి ఫ్యాక్స్ చేశారని ఎన్టీవీ తెలుగు టీవీ చానెల్ చెప్పుకుంది.

తనను వివాదాల్లోకి లాగేందుకు ఎవరో ప్రయత్నాలు చేస్తున్నారని, వారిని గుర్తించాల్సి ఉందని శ్యాంసుందర్ అన్నారు. సాయే తమ దేవుడని, సాయి కోసమే తాము జీవిస్తామని ఆయన చెప్పారు. సాయి యజుర్మిందర్‌లో భక్తులమంతా కలిసే ఉన్నామని, సాయి సేవలో అందరం కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. భక్తులమంతా పరస్పర సహకారంతో పనిచేస్తున్నామని ఆయన అన్నారు.

English summary
Sathya Sai Baba's devotee Shyam Sundar clarified that he never complained against anybody and never wrote a letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X