కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వదిన గెలిస్తే ప్రతిపక్షంలోనే ఉంటారు, ఆ అవసరం లేదు: వైయస్ వివేకా

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
కడప‌: పులివెందుల నియోజకవర్గంలో తన వదిన వైయస్ విజయమ్మ గెలిస్తే ప్రతిపక్షంలోనే ఉంటారని, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉండాల్సిన అవసరం లేదని, ప్రభుత్వంలో ఉండి ప్రజలకు అభివృద్ధిని అందించాల్సిన అవసరం ఉందని పులివెందుల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెసు అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డి అన్నారు. ఆయన మంత్రి పదవికి చేసిన రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు.

ఎమ్మెల్సీగా ఎన్నికై తిరిగి మంత్రిగా కొసాగుతారనే తప్పుడు సంకేతాలు తనపై వెళ్తున్నాయని, దానివల్ల పులివెందులలో వివేకాను ఓడించినా ఫరవా లేదనే ప్రచారం జరుగుతోందని, అందువల్లనే తాను రాజీనామా ఆమోదానికి పట్టుబట్టానని ఆయన చెప్పారు. నామినేటెడ్ పదవులను తాను కోరుకోవడం లేదని, పులివెందుల ప్రజలు గెలిపిస్తేనే మంత్రి పదవి చేపడతానని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో సెంటిమెంటుకు తావు లేదని ఆయన చెప్పారు. కుటుంబ సంక్షేమం చూసుకోవడం కన్నా ప్రజలకు సేవ చేయడం ముఖ్యమని ఆయన అన్నారు.

English summary
Congress Pulivendula candidate YS Vivekananda Reddy said that If Vijayamma wins she has to continue in opposition. He said that it is not necessary to continue in opposition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X