జగన్ పేరుతో పది, విజయమ్మ పేరుతో ఆరు నామినేషన్లు దాఖలు

YS Jagan
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో కడప లోకసభ స్థానానికి పది నామినేషన్లు దాఖలు కాగా, వైయస్ విజయమ్మ పేరుతో ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం సాయంత్రం ఈ రెండు స్థానాలకు కూడా నామినేషన్ల గడువు ముగిసింది. ఓటర్లను తికమక పెట్టే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా కాంగ్రెసు పార్టీ జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ పేర్లతో నామినేషన్లు దాఖలు చేయించినట్లు భావిస్తున్నారు. సోమవారం చివరి రోజు రికార్డు స్థాయిలో రెండు స్థానాలకు కూడా నామినేషన్లు దాఖలయ్యాయి.

కడప లోకసభ స్థానానికి మొత్తం 57 నామినేషన్లు దాఖలు కాగా, సోమవారం ఒక్క రోజే 36 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు క్యూ కట్టారు. పులివెందుల శాసనసభా స్థానానికి మొత్తం 36 నామినేషన్లు దాఖలు కాగా, సోమవారం ఒక్క రోజే 26 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశం కడప లోకసభ అభ్యర్థి మైసురా రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ రెండు స్థానాల్లోనూ మూడు ప్రధాన పార్టీలు రంగంలో ఉంటున్నాయి. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పోటీ పడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+