తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అపర కీచకుడు: టెన్త్ బాలికపై అత్యాచారం, ఆత్మహత్యా యత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chittoor District
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ అపర కీచకుడు తిరుపతిలో పదవ తరగతి చదువుతున్న అమ్మాయిపై అత్యాచారం చేశాడు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం కోడిగానిపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన అమ్మాయి పవిత్ర పరువు పోతుందనే భయంతో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఆత్మహత్యకు యత్నించిన పవిత్రను తొలుత గుడిపల్లి ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత తిరుపతిలో రుయా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో సుబ్రహ్మణ్యం అనే మేస్త్రీ పవిత్ర ఇంట్లోకి ప్రవేశించి, ఆమెపై అత్యాచారం జరిపాడు. ఆ సమయంలో పవిత్ర తమ్ముడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. సుబ్రహ్మణ్యంపై గుడిపల్లి పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
A Tenth class girl was raped in Chittoor district. With that the girl Pavithra attempted suicide. She was admitted in Tirupati Ruya hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X