2నెలల అనంతరం చంద్రబాబు ఇంటికి వెళ్లిన నాగం జనార్ధన్ రెడ్డి
చంద్రబాబుకు విషెస్ చెప్పేందుకే తాను వచ్చానని అన్నారు. తెలంగాణపై నిర్ణయం గురించి ప్రశ్నించగా తెలంగాణ విషయంలో తన వైఖరి మారదని స్పష్టం చేశారు. అయినా ఇప్పుడు రాజకీయాలు మాట్లాడటానికి సమయం కాదని ఆయన అన్నారు. కాగా గత కొంతకాలంగా నాగం - బాబు మధ్య అగాధం పెరుగుతున్న విషయం తెలిసిందే. ఓ సమయంలో తెలంగాణ విషయంలో బాబును ఎండగట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. నాగం టిడిపి వైఖరిని తప్పు పట్టడం ద్వారా చంద్రబాబుకు మింగుడు పడకుండా చేస్తున్నారు. దీంతో పలు సందర్భాల్లో బాబు నాగంపై పార్టీ కార్యక్రమాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగం సొంతగా త్వరలో తెలంగాణలో పాదయాత్ర కూడా చేపట్టనున్నారు. దీనికి ఎదుర్కొనడానికి టిడిపి చైతన్య యాత్రను బాబు కూడా ప్లాన్ చేస్తున్నారనే సమాచారం ఉంది. అయితే ఇద్దరి మధ్య అగాధం పెరిగిన అనంతరం నాగం మొదటిసారి బాబు ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.