హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చర్యలు ఎందుకు తీసుకోవద్దు: జగన్ వర్గం ఎమ్మెల్యేలకు పిసిసి షోకాజ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ గురువారం నోటీసులు జారీ చేసింది. మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ప్రశ్నిస్తూ నలుగురు ఎమ్మెల్యేలకు పిసిసి నోటీసులు జారీ చేసింది. కడప జిల్లాకు చెందిన అమరనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఆదినారాయణరెడ్డితో పాటు వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖకను రాష్ట్ర పార్టీ నోటీసులు జారీ చేసింది. జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని చెప్పింది.

కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభకు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అతి తొందరగా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పార్టీ భావిస్తున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే జగన్‌తో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వెళుతున్నప్పటికీ కేవలం నలుగురికి మాత్రమే నోటీసులు ఇచ్చి మిగిలిన వారిని దారిలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంలో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీ రాష్ట్ర క్యాడర్ నలుగురి పేర్లను అధిష్టానానికి పంపింది. అయితే గురువారం అధిష్టానం నుండి చర్యలకు స్పష్టమైన ఆదేశాలు రావడంతో పిసిసి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే, ఈ శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) తరఫున శానససభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరే అవకాశం ఉంది.

English summary
PCC sent notice to Ex MP YS Jaganmohan Reddy camp MLAs today. PCC sent notice to Adinarayana Reddy, Srikanth Reddy, Amarnath Reddy and Konda Surekha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X