వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యసాయి మరణం కలచి వేసింది: బాలకృష్ణ, నివాళులర్పించిన బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్‌/పుట్టపర్తి: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మరణం తనను ఎంతో కలచి వేసింది అని ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆదివారం అన్నారు. సత్యసాయిబాబాను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. బాబా సేవా కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తమయ్యారని చెప్పారు. బాబా చాలా గ్రామాలకు తాగునీటిని అందించి ప్రజల దాహార్తి తీర్చారని గుర్తు చేసుకున్నారు.

కాగా కడప జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హుటాహుటినా పుట్టపర్తికి ఉదయం బయలుదేరి వెళ్లారు. అనంతరం ఆయన బాబా పార్థివ శరీరాన్ని దర్శించుకొని నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బాబా సేవలు అమోఘమని చెప్పారు. బాబా మరణంతో కేవలం పుట్టపర్తి, అనంతపురం జిల్లా మాత్రమే కాదని అందరూ విషాదంలో మునిగి పోయారని చెప్పారు.

English summary
Hero Nandamuri Balakrishna felt very sad with Sathya Sai Baba assasination. He said Baba served to people very much.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X