అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుట్టపర్తికి రేపు ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ: రఘువీరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
అనంతపురం: కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పార్థివ శరీరాన్ని చివరిసారిగా దర్శించుకోవడానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం సాయంత్రం గం.4.30కు పుట్టపర్తికి వస్తారని మంత్రి రఘువీరారెడ్డి సోమవారం విలేకరులతో ఏర్పాటు చేసిన మంత్రుల సమావేశంలో తెలియజేశారు. బాబా పార్థివ శరీరాన్ని దర్శించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలి వస్తున్నారని చెప్పారు. ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు బాబాను దర్శించుకున్నారని మరో లక్ష మంది ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. భక్తులు అందరికి తప్పకుండా బాబా పార్థివ శరీర దర్శనం లభిస్తుందని ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు.

మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులకు నిరాఘాటంగా దర్శన భాగ్యం ఉంటుందని చెప్పారు. బాబా అంతిమ సంస్కారంలో ప్రపంచ నేతలు పలువురు పాల్గొంటారి చెప్పారు. రాబోయే తరాలకు పుట్టపర్తి పుణ్యక్షేత్రంగా వెలుగుతుందని చెప్పారు. బాబా పార్థివ శరీర దర్శనానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.

English summary
Minister Raghuveera Reddy said today that PM Manmohan Singh will coming tomorrow to see Sri Bhagvan Sri Sathya Sai baba.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X