వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థినిపై నెలల తరబడి అత్యాచారం, లేడీ వార్డెన్ ఎదుటే రాక్షసం

By Pratap
|
Google Oneindia TeluguNews

Student Rape
జైపూర్: జైపూర్‌లోని శిప్రా పథ్‌లో గల బాలికల హాస్టల్‌లో విద్యార్థినిపై నెలల తరబడి ఆత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేస్తూ రేప్ చేసిన ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. 21 ఏళ్ల బాధితురాలు శిప్రా పథ్‌లోని ఓ ప్రైవేట్ బిబిఎ చదువుతోంది. అత్యాచారం దారుణానికి పాల్పడిన హాస్టల్ యజమానులు మదన్ సింగ్‌, దీపక్ కుమార్‌లను, హాస్టల్ వార్డెన్ లక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు.

ఎడ తెరిపి లేని బ్లాక్ మెయిలింగ్, రేప్‌లకు విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జుంజును ప్రాంతానికి చెందిన విద్యార్థిని 2010 జూన్‌లో ప్రైవేట్ కాలేజీలో చేరింది. హాస్టల్ యజమానులు ఆమె తల్లిదండ్రులు తెలిసి ఉండడంతో ఆమె అందులో చేరింది. మొదట చాలా బాగా వ్యవహరించిన హాస్టల్ యజమానులు ఓ రోజు గదిలోకి తీసుకుని వెళ్లి విద్యార్థినిపై అత్యాచారం జరిపారు.

రేప్ చేస్తున్నప్పుడు నిందితులు వీడియో ఫుటేజ్ కూడా తీశారు. వీడియోను బయట పెడతామని బెదిరిస్తూ పలు చోట్ల ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చారు. విద్యార్థి తండ్రి సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. దీంతో స్థానికంగా ఆమెకు సంరక్షకులు ఎవరూ లేకుండా పోయారు.

English summary
Three persons, who were running a girls hostel in Shipra Path area in the city, were arrested for allegedly raping and blackmailing a 21-year-old student over several months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X