వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్య సాయిబాబా పార్ధివ దేహానికి మన్మోహన్ సింగ్, సోనియా నివాళులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Saibaba
పుట్టపర్తి : పుట్టపర్తి సత్య సాయిబాబా పార్ధివ దేహాన్ని సందర్శించి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం సాయంత్రం నివాళులు అర్పించారు. వారిద్దరు మంగళవారం సాయంత్రం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. నివాళులు అర్పించి, కొద్ది సేపు సాయి బాబా భౌతిక కాయం వద్ద కూర్చున్నారు. వారి వెంట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ ఉన్నారు. కేంద్ర మంత్రులు పి. చిదంబరం, మునియప్ప, పనబాక లక్ష్మి కూడా వారి వెంట ఉన్నారు.

మన్మోహన్, సోనియా రాకతో దాదాపు గంట పాటు భక్తుల సందర్శనను ఆపేశారు. సత్య సాయిబాబాను కడసారి చూడడానికి భక్తులకు మంగళవారం రాత్రి 11 గంటల వరకు అనుమతిస్తారు. తొలుత సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతించాలని నిర్ణయించినప్పటికీ భక్తులు పోటెత్తుతండడంతో సమయాన్ని పెంచారు. బుధవారం ఉదయం బాబా భౌతిక కాయాన్ని ఖననం చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల తర్వాత బాబా సమాధిని చూడడానికి భక్తులను అనుమతిస్తారు.

English summary
PM Manamohan Singh and AICC president paid homage to Sathya Sai baba at Puttaparthi. They reached Puttaparthi Prashanthi Nilayam in the evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X