నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లి లారీ బోల్తా పడి 12 మంది మృతి, నిజామాబాద్ జిల్లాలో విషాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Road Accident
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి లారీ బోల్తా పడి 12 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. లారీలో 60 మంది ప్రయాణిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే 17 మంది దాకా మరణించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ వాటిని ధ్రువీకరించడం లేదు. ప్రమాదంలో గాయపడిన మరో 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదం నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు మండలం లక్కోర గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. లారీ చిట్టాపూర్ నుంచి అమ్నాపూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిట్టాపూర్‌లో పెళ్లి అనంతర విందుకు హాజరై స్వగ్రామం తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఆమ్నాపూర్ గ్రామానికి చెందినవారేనని తెలుస్తోంది.

English summary
Tweleve persons were dead in Nizamabad district in a road accident. The accident occured due to overturn of lorry, which is carrying about 60 persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X