కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వంద కోట్లు ఎలా పంచాలో తెలియక మంత్రులు తికమక: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: కడప పార్లమెంటు స్థానంలో వంద కోట్ల రూపాయలు ఎలా పంచాలో తెలియక మంత్రులు తికమక పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. తనను ఒక్కడిని ఓడించడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర మంత్రివర్గాన్ని కడపలో దించారని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై బైండోవర్ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. బిజెపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.

తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం ప్రొద్దుటూరులో ముస్లిం మైనార్టీలను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చలవ వల్లే దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. వైఎస్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని వైఎస్ జగన్ మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులు వందల కోట్లు పట్టుకుని తిరుగుతున్నారని, వాటిని ఎవరికి పంచాలో వారికి అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తాను అధికారంలోకి వస్తే ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన చెప్పారు.

English summary
YSR Congress party Kadapa candidate YS Jagan lashed out at Congress party. He said that Sonia has sent entire ministers to defeat him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X