హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

9వ తేదీన తెలంగాణ సభ జరుగుతుంది: నాగం జనార్దన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: వచ్చే నెల 9వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలులో తెలంగాణ సభ జరిగి తీరుతుందని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. ఎవరికి తోచిన పద్ధతిలో వారు ప్రజలకు సన్నిహితం కావాలని పార్టీ సూచించిందని, ఆ మేరకే తాను 9వ తేదీన తెలంగాణ సభను ఏర్పాటు చేశానని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఈ బహిరంగ సభలో తెలంగాణ ప్రజా సంఘాలు పాల్గొంటాయని ఆయన చెప్పారు. తెలంగాణ కోరుకునేవారంతా ఈ సభలో పాల్గొనవచ్చునని ఆయన అన్నారు. ఈ సభ విషయంలో తమ పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు తనపై చేసిన ఆరోపణలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు.

తెలంగాణ కోసం తనను ఆహ్వానిస్తే వెళ్తున్నానని ఆయన చెప్పారు. 9వ తేదీ సభకు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ వాదులంతా కలిసి పని చేయాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అన్ని పార్టీల తెలంగాణ నాయకులు కలిసి పోరాడితే మంచిదని అంటున్నారని, ఆ సమయం రావాల్సి ఉందని ఆయన అన్నారు. సత్య సాయి సెంట్రల్ ట్రస్టుపై ఎవరూ విమర్శలు చేయకూడదని ఆయన అన్నారు. కాంగ్రెసు శాసనసభ్యుడు, మంత్రి జూపల్లి కృష్ణా రావు గురువారం ప్రారంభించిన పాదయాత్రకు తనకు అహ్వానం లేదని, అందుకే వెళ్లలేదని ఆయన చెప్పారు.

English summary
Nagam Janardhan Reddy confirmed that Telangana public meeting on May 9 at Nagar Kurnool of Mahaboob Nagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X