వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ మార్కెట్‌లోకి రానున్నశ్యామ్‌సంగ్ ఆండ్రాయిడ్ ఫోన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Samsung
పోయిన సంవత్సరం డిసెంబర్‌లో ఇంటర్నేషనల్‌గా విడుదలైనటువంటి శ్యామ్‌సంగ్ నెక్సస్ యస్ చివరకు ఇండియన్ మార్కెట్‌లోకి రానుంది. నెక్సస్ యస్ అనేది శ్యామ్‌సంగ్ ఆండ్రాయిడ్ ఫోన్. ఇక ఈ ఫోన్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ జింజర్ బ్రీడ్ 2.3తో రన్ అవుతూ 1GHz Cortex A8 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఇక దీని డిప్లే విషయానికి వస్తే టచ్ స్క్రీన్ కలిగిఉండి స్క్రీన్ సైజు 480*800 పిక్సల్ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా దీనిపైనున్నటువంటి గ్లాస్ వంపులాంటి షేపుని కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ మొత్తం సెన్సార్స్, త్రి-యాక్సిస్ గైరోస్కోప్, ఎక్సిలోరోమీటర్, డిజిటల్ కంపాస్, ప్రాక్సిమిటి సెన్సార్ మరియు లైట్ సెన్సార్ కలిగి ఉంటడం దీని ప్రత్యేకత. ఇక ఫోన్ డేటా ఎన్‌ఎ‌ఎన్‌డి ఫ్లాష్ మొమొరి కార్డులో సేవ్ చేసకోవచ్చు. దీని కెపాసిటీ 16జిబి. ఇక కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు ఉన్నటువంటి కెమెరా 5మెగా ఫిక్సల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. వీడియో కూడా 720 x 480 ఫిక్సల్ రిజల్యూషన్‌తో తీయవచ్చు. కెమెరాకి ఆటో ఫోకస్, ఫ్లాష్‌తో పాటు ముందు వైపు ఉన్నటువంటి కెమెరా విజిఎ కెమెరా. ఫోన్ బ్యాటరీ ప్యాకప్ 1500mAh. మీరు ఆరు గంటలు నిరభ్యంతరంగా మాట్లాడుకోవచ్చు. అదే స్టాండ్‌బై టైమ్‌లో గనుక ఉంటే 18రోజులు బ్యాటరీ ప్యాకప్ వస్తుంది. ఇక దీని ఖరీదు ఇండియన్ మార్కెట్‌లో కేవలం రూ 29, 590.

English summary
Nexus S joins the family of Samsung's Android based phones, taking the total tally to six devices. This particular phone is running on Android “Gingerbread” 2.3 and powered by a 1GHz Cortex A8 (Hummingbird) processor. The 4” capacitive touch-screen uses super AMOLED display with a maximum resolution of 480X800 pixels and it is covered by a curved glass screen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X