హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వెంట వెళుతున్న పీఆర్పీ ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

PRP
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళుతున్న ఎమ్మెల్యేలపై విడతల వారిగా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడినట్లుగానే కనిపిస్తోంది. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం జగన్ వెంట వెళుతున్న ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డిలకు షోకాజ్ నోటీసులు పంపించారు. షోకాజ్ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించారు.

కాగా రెండు రోజుల క్రితం ప్రజారాజ్యం పార్టీ విప్ వంగా గీత స్పీకరు నాదెండ్ల మనోహర్‌ను కలిసి శోభానాగిరెడ్డి, కాటసానిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే జగన్ వెంట వెళుతున్న కాంగ్రెసు ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఆదినారాయణరెడ్డి, అమరనాథ్ రెడ్డి తదితర నలుగురు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసిలు ఇచ్చిన విషయం తెలిసిందే.

English summary
Deputy speaker Nadendla Manohar sent show cause notice to Ex MP YS Jaganmohan Reddy camp PRP MLAs today. He ordered to give reply within in the week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X