హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్బరుద్దీన్ శరీరం నుంచి నాలుగు బుల్లెట్ల తొలగింపు: రేపు బంద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: దాడిలో గాయపడిన మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీకి ప్రాణాపాయం లేదని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. సంఘటన జరిగిన వెంటనే ఆమె శనివారం పరిస్థితిని సమీక్షించారు. అక్బరుద్దీన్ శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకుపోయాయి. ఆయనకు శస్త్రచికిత్స చేశారు. అక్బరుద్దీన్ పొట్ట, ఎడమ చెవి, ఎడమ చేయి, ఛాతీ భాగాల నుంచి బుల్లెట్లు దూసుకుపోయాయి. వాటిని శస్త్ర చికిత్స చేసి వైద్యులు తొలగించారు. అక్బరుద్దీన్ కోలుకుంటున్నట్లు సమాచారం.

అక్బరుద్దీన్ క్షేమం అంటూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ ఆస్పత్రి వద్ద ప్లకార్డు ప్రదర్శించారు. ఘటనలో గాయపడిన కార్పోరేటర్ హవలా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అక్బరుద్దీన్ సోదరుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. అక్బరుద్దీన్‌పై దాడికి నిరసనగా మజ్లీస్ పార్టీ ఆదివారం హైదరాబాద్ బంద్‌కు పిలుపునిచ్చింది.

English summary
Home Minister Sabitha Indra Reddy said that MIM MLA Akbaruddin Owaisi out of danger. It is said that four bullets were removed from the body of Akbaruddin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X