ఉపపోరులో వైయస్ జగన్, వివేకానందరెడ్డి మధ్య కరపత్రాల యుద్ధం
విశ్వసనీయతా, నీ రూపం ఇదేనా అనే పేరుతో వైయస్ వివేకానందరెడ్డి వర్గం కరపత్రాలు ముద్రించి వోటర్లకు పంచి పెట్టింది. పెంచి పెద్ద చేసిన కాంగ్రెసు పార్టీని వీడి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడానికి మళ్లీ ఎన్నికలు తేవడమే విశ్వసనీయతా అని అందులో ప్రశ్నించారు. జగన్కు ఓటేయకుండా బుద్ధి చెప్పాలి అనే కరపత్రాలను ముద్రించారు. దీనికి ప్రతిగా జగన్ వర్గం వైయస్ వివేకానందరెడ్డికి ఎందుకు ఓటు వేయవద్దు అనే కరపత్రాన్ని ముద్రించింది. వివేకానంద కాంగ్రెసులో ఉండి కుటుంబ గౌరవాన్ని మంట గలిపారని, మంత్రి పదవి కోసం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెసు బానిస అయ్యారన్నారు. వివేకా మంత్రి పదవి వల్లే ఎన్నికలు వచ్చాయని ఆరోపించారు. వివేకా కాంగ్రెసు పిచ్చిలో పడిపోయారన్నారు.
Comments
English summary
Pomphlet war is going on between Ex MP YS Vivekananda Reddy, Congress Pulivendula candidate YS Vivekananda Reddy. YS Jagan blamed Vivekananda Reddy in his pomphlet.
Story first published: Tuesday, May 3, 2011, 10:43 [IST]