కుక్క కాటుకు అనూష మృతి, చేతులెత్తేసిన రాజమండ్రి వైద్యులు

ఆమె తల్లి అనూషకు స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీతో వైద్యం చేయించింది. ఆ డాక్టరు కూడా టీటీ ఇంజక్షన్ ఇచ్చి వదిలేశాడు. కుక్కకాటుకు ఈ వైద్యం సరిపోదని, ఏఆర్వీ వేయించాలని ఆ తల్లికి తెలియదు. మంగళవారం అనూష ఆరోగ్య పరిస్థితిలో బాగా మార్పు కనిపించింది. కూతురిని రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడి సిబ్బంది ఒక సూది వేసి పాపను బెడ్ మీద పడుకోబెట్టారు.
అనూష ఆస్పత్రిలో నురగలు కక్కుతూ కేకలు వేసింది. ఒక్క డాక్టరూ రాలేదు. నర్సూ రాలేదు. ఆస్పత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.దాదాపు రెండు గంటలు గడిచిపోయాయి. నురగలు కక్కుతూ, కేకలు వేస్తూ అనూష ప్రాణాలు విడిచింది. గతంలో కూడా కొంత మంది కుక్క కాటుకు రాజమండ్రిలో బలయ్యారు. అనూష మృతిపై మావన హక్కుల కమీషన్ తీవ్రంగా ప్రతిస్పందించారు. వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications