శ్రీ సత్య సాయి సెంట్రల్ టస్టుకు చైర్మన్ సత్య సాయి బాబానే
సత్యసాయి ఇంటర్నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ఈ నెలలో బుద్ధపౌర్ణమిని పురస్కరించుకుని రెండ్రోజుల పాటు పుట్టపర్తిలోని సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రపంచ ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రొఫెసర్ అనిల్కుమార్, సత్యసాయి కళాశాల పూర్వ విద్యార్థి సంజయ్సహాని తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ట్రస్టు కార్యదర్శి చక్రవర్తి, సభ్యులు శ్రీనివాసన్, ఎస్.వి.గిరి, భగవతి, ఇందూలాల్షా, జె.వి.శెట్టితో పాటు దేశ, విదేశాలకు చెందిన సత్యసాయి భజనమండలి సభ్యులు, సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు.
బాబా ఆరాధనోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బాబా దేహాన్ని వీడి పది రోజులు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మహాసమాధి ఏర్పాటు చేసిన సాయికుల్వంత్ హాల్లో ఉదయం 6.30 నుంచి 10.30 గంటల వరకు బాబా కుటుంబ సభ్యులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాజమండ్రికి చెందిన కందుకూరి కొండావధాని శాస్త్రి నేతృత్వంలో 13 మంది వేదపండితులు, రుత్వికులు నారాయణ బలిహోమంతో పాటు పలు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 6.30 గంటలకు విఘ్నేశ్వర పూజతో ఆరాధనోత్సవం ప్రారంభమైంది.
పుణ్యావచనం, పురుషసూక్త సహిత పారాయణం, మండపారాధన, నారాయణ బలిహోమం, తీర్థరాజ పూజలు నిర్వహించారు. వైకుంఠలోక ప్రాప్తం కోసం పూజలు, హోమాలు చేసినట్లు కొండావధాని శాస్త్రి తెలిపారు. బాబా సోదరుడి కుమారుడు రత్నాకర్ మహాసమాధి వద్ద తీర్థరాజ పూజలు చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఆరాధనోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేద పఠనంతో కుల్వంత్ హాలు మారుమోగింది.