వైయస్ జగన్‌పై చంద్రబాబు అవినీతి ఆరోపణలు పని చేయలేదా?

Chandrababu Naidu
హైదరాబాద్: కడప లోకసభ స్థానానికి, పులివెందుల శాసనసభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి ఆరోపణలు పనిచేయలేదనే మాట వినిపిస్తోంది. వైయస్ జగన్ కోట్లాది రూపాయలు ఎలా కూడగట్టారని, ఎలా అక్రమాస్తులు సంపాదించారని ఆయన తీవ్రంగా దాడి చేశారు. వైయస్ జగన్‌పై తన ప్రచారంలో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రి వైయస్సార్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ఆయన ఆరోపించారు. జగన్ అవినీతినే ప్రధానాస్త్రంగా చేసుకుని ఆయన ప్రచారం చేశారు. అయితే, కడప లోకసభ స్థానంలోని ప్రజలు చంద్రబాబు ఆరోపణలను, వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు.

ఓ తల్లిని, బిడ్డను ఒంటరి చేసి దాడి చేస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యనే ప్రజల్లోకి లోతుగా వెళ్లిందని భావిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న ఆదరాభిమానాల ముందు, ఆయన మృతి వల్ల పెల్లుబుకిన సానుభూతి ముందు చంద్రబాబు ఆరోపణలు పని చేయలేదని అంటున్నారు. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంవి మైసురా రెడ్డి కనీసం రెండో స్థానంలోనైనా నిలుస్తారా అనేది సందేహంగానే ఉందని అంటున్నారు. కాంగ్రెసు ఓట్లన్నీ జగన్‌కు పడి, తెలుగుదేశం ఓట్లు చెక్కు చెదరకుండా మైసురా రెడ్డికి పడితే రెండో స్థానం వచ్చినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.

కాగా, పులివెందులలో వైయస్సార్ సతీమణి వైయస్ విజయమ్మ, వైయస్సార్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి మధ్య మాత్రమే ఓట్లు చీలుతాయని, తెలుగుదేశం అభ్యర్థి బిటెక్ రవికి ఓట్లు ఏ మాత్రం పడతాయనేది కూడా అనుమానమేనని చెబుతున్నారు. పైగా, బిటెక్ రవి పులివెందులకు సంబంధించి బలమైన అభ్యర్థి కూడా కారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+