కిరణ్ కుమార్ రెడ్డికి కడప చిచ్చు, మంత్రుల్లో పెరుగుతున్న అసంతృప్తి

కడప ఉప ఎన్నికలపై ముందస్తు వ్యూహరచనలో కిరణ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారని, దాంతో రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు. పైగా, కడప ఉప ఎన్నికల ప్రచారానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ దూరంగా ఉండి, బాధ్యత ముఖ్యమంత్రిదే అన్నట్లు వ్యవహరించారు. తన వైఫల్యాలను కిరణ్ కుమార్ రెడ్డి ఇతరులపైకి నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అసమ్మతివాదులు అంటున్నారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పుడుతున్నవారిపై చర్యలు తీసుకోకపోవడం కూడా నష్టానికి కారణమని అంటున్నారు. ఉప ఎన్నికలు జరుగుతాయని తెలిసినా కడప జిల్లాలో పునాది స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసే పనికి కిరణ్ కుమార్ రెడ్డి పూనుకోలేదని అంటున్నారు. కింది స్థాయిలో కీలక నేతలే కరువయ్యారు. జిల్లాలో పరిస్థితిపై డి. శ్రీనివాస్తో చర్చించి తగిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. మొత్తం మీద, ఉప ఎన్నికల తర్వాత మార్పు సంభవిస్తుందన్న జగన్ మాట నిజమవుతుందేమోననే వ్యాఖ్య కూడా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications