రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియుడి ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం: ప్రియురాలి బంధువులపై అనుమానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajahmundry
రాజమండ్రి: ప్రియురాలి బంధువులు ప్రియుడిని చంపేసి మూటకట్టి గోదావరిలో పడేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం బీమనపల్లికి చెందిన భీమశంకరం సోమవారం ఎదురులంక వద్ద గోదావరి నదిలో శవమై తేలాడు. ఆయన శవం మూటకట్టి ఉంది. అయితే భీమశంకరం గత కొన్నాళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అది నచ్చని వారి బంధువులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని బంధువులు ఆరోపించారు.

భీమశంకరం గత నెల 29న అదృశ్యమయ్యాడు. మృతుడి బంధువుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో దృష్టి సారించారు. అయితే మృతుడిని మూటగట్టి పడేసినందున ప్రియురాలి బంధువులే హత్య చేసి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
Lover's relatives killed Bhima Shankaram in East Godavari district. Police found his dead body at Edurulanka. They suspecting on Lover's relatives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X