వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లైన పదిరోజులకే భార్యను వదిలేసిన ఎన్నారై: అదనపు కట్న వేధింపులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nalgonda District
నల్గొండ: పెళ్లైన పదిరోజులకే ఓ ఎన్ఆర్ఐ భార్యను వదిలేసిన సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని సూర్యాపేటకు చెందిన శిరీష అనే యువతిని గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ప్రతాప్ రెడ్డి అనే ఎన్ఆర్ఐ పదిరోజుల క్రితం ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి సమయంలో అమ్మాయి తరఫున వారు ముప్పై లక్షల కట్నం కూడా ప్రతాప్ రెడ్డికి ఇచ్చారు. అయితే పెళ్లి తర్వాత అత్తింటికి వచ్చిన అమ్మాయిని భర్త అదనపు కట్నం కోసం వేధించినట్లుగా సమాచారం.

అదనపు కట్నం కోసం వేధించి పెళ్లైన పదిరోజులకే భార్యను చీట్ చేశాడు. దీంతో చేసేది లేక భార్య, ఆమె తరఫున వారు ప్రతాప్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టారు. పోలీసులు స్పందించి ప్రతాప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. కాగా ప్రతాప్ రెడ్డి గుంటూరు జిల్లా మాచర్లకు చెందినవాడు.

English summary
NRI Pratap Reddy cheated his wife for dowry in Suryapet of Nalgonda district. He cheated her within 10 days after marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X