హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం క్యాంపు కార్యాలయం ముందు యువతి ఆత్మహత్యాయత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karimnagar District
హైదరాబాద్: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముందు సోమవారం ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముందుకు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అత్మహత్యాయత్నానికి యత్నించిన యువతి పేరు యశోదగా తెలుస్తోంది. ఈమె కరీంనగర్ జిల్లా జగ్జీవన్‌రావు పేటకు చెందిన వ్యక్తి. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ దొరకలేదనే ఆమె అత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

యశోద తమ గ్రామంలో ఉన్న తమ స్థల వివాదం విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు రావడానికి తన తండ్రి దుర్గయ్యతో కలిసి వచ్చింది. భూవివాదం కేసులో రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేయడానికి ఆమె వచ్చారు. అయితే ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఎంతకూ దొరకక పోయేసరికి ఆమె పురుగుల మందు తాగింది. కాగా ఆమె పరిస్థితి ఆందళనకరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

English summary
Woman committed to suicide attempt at CM camp office today. Yashoda, who trying to attempt was sent to hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X