మళ్లీ జగన్ ఓదార్పు యాత్ర, విజయనగరం జిల్లాలో ఈ నెల 14 నుంచి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రకటించిన తరువాత తొలియాత్ర విజయనగరంలోనే ప్రారంభమైందని, కడప ఉప ఎన్నికల కారణంగా మార్చి 30న వాయిదా పడిందని గుర్తుచేశారు.ఉప ఎన్నికల ఫలితం ప్రభావం అధికార పార్టీపై వుంటుందని, రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణలకు ఇది బీజం వేయనున్నదన్నారు. తెలంగాణ జిల్లాల్లో కూడా ఓదార్పు యాత్ర జరుగుతుందని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పెద్దింటి జగన్మోహనరావు, కె.శ్రీనివాసరాజు, వాకాడ నాగేశ్వరరావు, అవనాపు సూరిబాబు, డాక్టర్ కాశీనాయుడు, కె.శివున్నాయుడు, డి.సత్యనారాయణ, వాసిరెడ్డి తిలక్ కిరణ్, డాక్టర్ పెద్దినాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications