వల్లభనేని వంశీపై భగ్గుమంటున్న జూనియర్ ఎన్టీఆర్?
తెలుగుదేశం కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వర రావుపై తిరుగుబాటు చేయడం ద్వారా చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలని భావించిన నందమూరి హరికృష్ణ వ్యూహాన్ని వంశీ దెబ్బ తీశారనే ఆగ్రహంతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. వంశీ బేషరతుగా చంద్రబాబుకు లొంగిపోయారని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు. దాంతో వంశీకి దూరం కావాలని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
ఆ కోపంతోనే జూనియర్ ఎన్టీఆర్ వంశీ సంతానం బారసాలకు మొక్కుబడిగా వెళ్లి వచ్చారని అంటున్నారు. నందమూరి హరికృష్ణ కనీసం పలకరించలేదని అంటున్నారు. చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలనే వ్యూహం వంశీ లొంగుబాటు వల్ల తాత్కాలికంగా దెబ్బ తిన్నదని భావిస్తున్నారు. ఇదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్తో నందమూరి హరికృష్ణ మంతనాలు జరుపుతుండగా, జూనియర్ ఎన్టీఆర్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.