వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగం జనార్దన్ రెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకోదు: రేవూరి ప్రకాశ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలులో తెలంగాణ సభ నిర్వహించిన తమ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డిపై తమ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోబోదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు రేవూరి ప్రకాశ రెడ్డి స్పష్టం చేశారు. నాగం జనార్దన్ రెడ్డి మొదటి నుంచీ తెలంగాణవాదం వినిపిస్తున్నారని ఆయన చెప్పారు. నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారంపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులతో సమావేశమయ్యారు.

నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ సభ నిర్వహించడం సమర్థనీయమేనని ఆయన అన్నారు. తాము కూడా నాగం జనార్దన్ రెడ్డి మాదిరిగా ప్రత్యేక తెలంగాణ సభలు నిర్వహిస్తామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. నాగర్ కర్నూలు సభకు రావాలని నాగం జనార్దన్ రెడ్డి ఫోన్ చేసి తమకు చెప్పినట్లు ఆయన తెలిపారు. నాగం జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోందని వస్తున్న వార్తల నేపథ్యంలో రేవూరి ప్రకాశ రెడ్డి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
TDP Telangana region leader Revuri Prakash Reddy said that party high command will not take action against Nagam Janardhan Reddy, who organised telangana public meeting at Nagar Kurnool.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X