జగన్ ఆధిక్యతపై లగడపాటి సర్వేలు తప్పు: ఎమ్మెల్యే వీరశివారెడ్డి

జగన్ ఆధిక్యతపై పత్రికలలో వచ్చిన కథనాలు కూడా తప్పు అని అన్నారు. జగన్ ఆధిక్యతను అంతకంతకు పెంచి చూపిస్తున్నారని ఆయన అన్నారు. జగన్కు రెండులక్షల ఆధిక్యత వచ్చే పరిస్థితే లేదన్నారు. ఫలితాలు మే 13న వస్తాయని అప్పుడు లగడపాటి సర్వే, పత్రికల కథనాలు తప్పు అని తేలుతుందని చెప్పారు.
ఉప ఎన్నికలలో జగన్ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. జగన్కు స్థానిక ఎస్పీ తరుణ్ జోషి సహకరించారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేనని తనకు స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉన్నప్పటికీ ఎస్పీ తనను గృహ నిర్బంధం చేశారని అన్నారు. ఉప ఎన్నికల రోజు తనను ఎస్పీ తీవ్రంగా వేధింపులకు గురి చేశారని అన్నారు. ఎస్పీకి సభా హక్కుల నోటీసు ఇస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications