వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో మహిళతో ఉంటున్నాడని డిప్యూటీ మేయర్‌పై భార్య ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajamundry
రాజమండ్రి: రాజమండ్రి డిప్యూటీ మేయర్ సత్యనారాయణ ప్రసాద్‌పై ఆయన భార్య సుజాత వరకట్నం, గృహహింస కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను తన భర్త సత్యనారాయణ ప్రసాద్ మానసిక హింసకు గురి చేస్తున్నారని, అదనపు కట్నం అడుగుతున్నారని ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు 2002లో వివాహమైందని, కట్నంగా పది లక్షల రూపాయలూ బంగారం ఇచ్చారని ఆమె చెప్పారు.

మరో మహిళతో వైవాహికేతర సంబంధం పెట్టుకున్న తన భర్త గత ఎనిమిది నెలలుగా ఇంటికి రావడం లేదని ఆమె చెప్పింది. వారిద్దరినీ తాను పట్టుకున్నానని ఆమె చెప్పింది. నువ్వు నాకు తగవని చెప్పి సత్యనారాయణ ప్రసాద్ తనను వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు. పెళ్లి ఫొటోలను చించేశారని, మిగతా ఫొటోలు, ఇతర ఆధారాలు మాత్రం ఉన్నాయని ఆమె చెప్పారు.

English summary
Rajamundry deputy mayor Satynarayana Prasad's wife Sujatha complained to the police against him. She said that her husband is harassing her dowry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X