మళ్లీ మొదటికొచ్చిన కర్ణాటక కథ, యెడ్యూరప్పకు కష్టాలు

ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్తో భేటీ తర్వాత భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. శాసనసభలో ఉన్న శాసనసభ్యులందరూ పాల్గొనేలా బలపరీక్ష జరగాలనే విషయం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రుజువైందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బలపరీక్ష చేసుకోవాలని యెడ్యూరప్పను ఆదేశిస్తారా అని అడిగితే సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. అలా చెప్పడం తొందరపాటు అవుతుందని ఆయన అన్నారు.
సుప్రీంకోర్టు తన తీర్పులో ముఖ్యమంత్రికి, స్పీకర్కు చురకలు అంటించిందని ఆయన చెప్పారు. ప్రధానిని తాను మర్యాదపూర్వకంగానే కలిశానని ఆయన చెప్పారు. కర్ణాటక రాజకీయాలు తాను ప్రధానితో మాట్లాడలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications