పౌరుషం ఆయనకే కాదు, కండబలం, డబ్బుతో గెలిచాడు: జగన్పై విహెచ్

రైతులపై జగన్ కపడ ప్రేమ చూపిస్తున్నారన్నారు. సోనియా ఆలోచన మేరకే వైయస్ రైతు పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. వేలాది ఎకరాల భూములను అప్పనంగా పెద్ద పెద్ద కంపెనీలకు అప్పగించి కోట్లాది రూపాయలు వైయస్ కుటుంబం సంపాదించిందన్నారు. అలాంటి జగన్ ఇప్పుడు రైతుల కోసం దీక్ష అనడం హాస్యాస్పదం అన్నారు. వేల ఎకరాల భూమిలు కొల్లగొట్టి రైతుల పొట్టగొట్టిన ఘనత వైయస్ కుటుంబానిదన్నారు. ఏళ్ల క్రింద కంపెనీలకు భూములు ఇచ్చినా ఇప్పటి వరకు ఇండస్ట్రీలు రాలేదన్నారు. జగన్ వర్గం మైనింగ్ను కూడా కొల్లగొడుతుందని దానిని ఆపాల్సిన బాధ్యత కాంగ్రెసుపై ఉందన్నారు. జగన్ తన పాపులారిటీ పెంచుకోవడానికే దీక్షలు చేస్తున్నారన్నారు. నెల్లూరు నుండి వైజాగ్ వరకు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఎన్ని వేల ఎకరల భూములు పంచి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారో జగన్ను ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు. వైయస్ హయాంలోనే రైతులు రోడ్డున పడ్డారన్నారు.
అన్నాహజారే బాటలో నడుస్తానని చెబుతున్న జగన్ తన ఆస్తులపై సొంతగా విచారణ జరిపించుకోవాలని డిమాండ్ చేశారు. వైయస్ ముఖ్యమంత్రి కాకముందు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయో జగన్ తేల్చి చెప్పాలన్నారు. లక్షల నుండి వేల కోట్లకు ఎలా ఎగబాకారని ప్రశ్నించారు. గతంలో వైయస్ నా సహాయ సహకారాల వల్లే పిసిసి అధ్యక్షుడు అయ్యారన్నారు. అలాంటి వైయస్ కుటుంబం గురించి పూర్తిగా నాకు తెలుసని చెప్పారు. సోనియాను ఇటలీ నాయకురాలు అని విమర్శించడం సరికాదన్నారు. కడపలో గెలిచినంత మాత్రాన తనకు మాత్రమే ఇమేజ్ ఉందని, మరెవరికీ లేదనే అహంభావం జగన్లో కనిపిస్తుందన్నారు. ప్రాజెక్టుల పేరుతో రైతుల పొట్ట కొట్టిన వైయస్, జగన్కు కోట్లాది రూపాయలు ఇచ్చారన్నారు. సేకరించిన భూములు సెజ్లకు ఉపయోగపడుతున్నాయా లేదా అని త్వరలో అన్ని జిల్లాల్లో యాత్ర చేపడతానని చెప్పారు. జగన్ ఆస్తులపై విచారణ జరిపించాలని ఆజాద్ను కోరనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications