వామపక్షాలతో వైయస్ జగన్ దోస్తీ: తెలంగాణకు మొండిచేయి

YS Jagan
గుంటూరు‌: వామపక్షాలతో దోస్తీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సిద్ధపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు మాటల ద్వారా ఆ విషయం అర్థమవుతోంది. ప్రజాసమస్యపై వామపక్షాలతో కలిసి పనిచేస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. వామపక్షాలతో తాము మంతనాలు జరుపుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. వామపక్షాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని నమ్మే స్థితి లేదని ఆయన అన్నారు. జగన్‌తో సిపిఎం దోస్తీకి సిద్ధపడుతున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు మాటలను బట్టి కూడా తెలుస్తోంది. జగన్ దీక్షకు ఆయన మద్దతు ప్రకటించారు.

కాగా, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి వైయస్ జగన్ ముందుకు వస్తున్నారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సిపిఎం దోస్తీ సంకేతాలను ప్రత్యేకంగా గమనించాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడంలో భాగంగా, జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుండా చేసే చర్యలో భాగంగా సిపిఎం దోస్తీకి సిద్ధపడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. పైగా, ప్రజలు అనుకూలంగా ఉన్నా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటు జగన్‌కు లేదని చెప్పవచ్చు.

వైయస్ జగన్ వెంట ఉన్న ప్రధాన నాయకులు చాలా మంది తెలంగాణకు వ్యతిరేకమే. జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగానే ఉన్నారు. జూపూడి ప్రభాకర రావు ఇటు తెలంగాణకు అటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకం. దీంతో తెలంగాణకు అనుకూలంగా జగన్ నిర్ణయం తీసుకోకుండా చూడడానికి సిపిఎం కూడా రంగంలోకి దిగుతోందని భావించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+