వైయస్ జగన్ దీక్షకు తగ్గిన ఎమ్మెల్యేలు, 19 మంది మాత్రమే హాజరు

కాగా, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి దీక్షకు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర రావు, కొండా మురళి దీక్షలో పాల్గొన్నారు. శాసనసభ్యులు కొండా సురేఖ, బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, బాలరాజు, బాబూరావు, శేషా రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, ప్రసాదరాజు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కొర్ల భారతి వంటి శాసనసభ్యులు దీక్షకు హాజరయ్యారు.
కమలమ్మ ఇప్పటికే వైయస్ జగన్కు దూరమయ్యారు. అలాగే, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు కాటసాని రాంరెడ్డి కూడా వెనక్కి వచ్చారు. పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, షాజహాన్, రవి వంటి శానససభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆజాద్కు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications