గులాం నబీ ఆజాద్ను లెక్క చేయని వైయస్ జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలు

మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు, శాసనసభ్యుడు కృష్ణదాస్ జగన్ దీక్షకు వెళ్లి తనకు సోనియా గాంధీ అంటే ఎవరో తెలియదని, తనకు వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రమే తెలుసునని అన్నారు. ఆజాద్ విషయం తనకు తెలియదని పిల్లి సుభాష్ చంద్ర బోస్ అన్నారు. ఆజాద్ హైదరాబాదుకు చేరుకున్న రోజునే జగన్ దీక్షకు 17 మంది శాసనసభ్యులు వెళ్లారు. పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, నలుగురు ఎమ్మెల్సీలు కూడా జగన్ దీక్ష వద్దనే ఉన్నారు. దీన్ని బట్టి కాంగ్రెసు అధిష్టానం తీసుకునే చర్యలకు తాము భయపడడం లేదని జగన్ వర్గం శాసనసభ్యులు సవాల్ విసురుతున్నట్లుగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications