హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కళ్యాణమస్తులో కర్కాటక లగ్నాన ఒక్కటైన 12వేల జంటలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కళ్యాణమస్తులో భాగంగా శుక్రవారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా 12వేల మంది జంటలు ఒక్కటయ్యాయి. శుక్రవారం ఉదయం గం.9.52 నిమిషాల నుండి గం.10.04 నిమిషాల మధ్య కర్కాటక లగ్న పుష్కరాంశ ముహూర్తాన ఈ జంటలు ఒక్కటయ్యాయి. కాగా హైదరాబాదులోని లలిత కళా తోరణంలో జరిగిన కళ్యాణమస్తుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయి వధూవరులను ఆశీర్వదించారు. జంటలకు టిటిడి ఉచితంగా మంగళ సూత్రాలు అందించింది.

కాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న కళ్యాణమస్తులో ఓ మైనర్ పెళ్లిని అధికారులు ఆపారు. వధూవరుల తల్లిదండ్రులు వయసు ధృవీకరణ పత్రాలు తీసుకు రాలేదు. తల్లిదండ్రులు రాక పోవడంతో అధికారులు కాసేపు వేచి చూశారు.

English summary
12 thousand marriages occurred under Kalyanamasthu today. CM Kiran Kumar Reddy attended at Lalitha Kala Thoranam Kalyanamasthu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X