వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా బంధం విడదీయరానిది: కాంగ్రెసుతో మైత్రిపై కరుణానిధి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karunanidhi
చెన్నై: కాంగ్రెసు పార్టీతో డిఎంకె మైత్రి విడదీయరానిది అని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత కరుణానిధి అన్నారు. కాంగ్రెసుతో పొత్తు వీడి పోతుందని వస్తున్న మీడియా కథనాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. మా పొత్తు కొనసాగుతుందని, కాంగ్రెసు, డిఎంకె బంధం విడదీయరానిది అని కరుణానిధి స్పష్టం చేశారు. కాగా తమ కుమార్తె కనిమొళి ఎలాంటి నేరం చేయలేదని కరుణానిధి చెప్పారు. డిఎంకెపై ఉన్న కక్ష్య కారణంగానే కొందరు కనిమొళిపై నేరారోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కనిమొళి అరెస్టు చట్టవిరుద్దమని ఆయన అన్నారు. చట్టానికి అతీతంగా కనిమొళిని జైలుకు పంపారని ఆరోపించారు. కనిమొళి ఆరోపణలు సమర్థంగా ఎదుర్కొని తన నిజాయితీ నిరూపించుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కరుణానిధి సోమవారం న్యూఢిల్లీ వెళ్లనున్నారు. అయితే సోనియాతో భేటీ అయ్యే విషయం అనుమానంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది.

English summary
DMK chief Karunanidhi said that DMK and Congress friendship will continue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X