ఉప ముఖ్యమంత్రిగా దామోదర, పిసిసి అధ్యక్షుడి పదవి ఆంధ్రకు?

దీనిపై ఆదివారం అధిష్ఠానంతో కిరణ్ పలు దఫాలు చర్చించారు. పిసిసి అధ్యక్ష పదవి ఏ ప్రాంతం వారికి, ఎవరికి ఇవ్వాలనే విషయమై అధిష్ఠానంతో ఆదివారం మరో దఫా చర్చ జరుగుతుందని చెబుతున్నారు. ఈ పదవికి తెలంగాణకు చెందిన పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, సంభాని చంద్రశేఖర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సర్వే సత్యనారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా పొన్నాల, షబ్బీర్ అలీ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పదవి మంత్రి దామోదర రాజనరసింహకు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి తెలంగాణ వారికి ఇస్తే పిసిసి పీఠాన్ని ఆంధ్రా ప్రాంతానికి ఇవ్వాలని అక్కడి నేతలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక స్పీకర్ పదవి నాదెండ్ల మనోహర్కు దాదాపు ఖరారైనట్లే. డిప్యూటీ స్పీకర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది.












Click it and Unblock the Notifications