వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి పంట పండుతుందా, కోర్ కమిటీలోకి తీసుకుంటారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పంట పండుతుందా, ఆయనను కాంగ్రెసు కోర్ కమిటీలోకి తీసుకుంటారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న చిరంజీవికి కాంగ్రెసు అధిష్టానం ఉన్నత స్థానం కల్పిస్తుందంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. ఆయనకు దక్కే ఉన్నత స్థానం పార్టీలోనా, ప్రభుత్వంలోనా అనేది తేలడం లేదు. పార్టీపరంగా ఆయన సేవలను వాడుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉన్నారు. ఇందుకు అనుగుణంగానే ఆయనకు ఇచ్చే పదవి ఉంటుందని భావిస్తున్నారు. ఆయనను అత్యంత ప్రధానమైన కోర్ కమిటీలోకి తీసుకోవచ్చుననే వార్తలు వస్తున్నాయి. పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థ సిడబ్ల్యుసిలో స్థానం కల్పిస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ, ఆయనకు దక్కే పదవి ఏమిటనేది స్పష్టం కావడం లేదు.

ఇటీవల ఢిల్లీ వెళ్లిన చిరంజీవికి సోనియా అపాయింట్‌మెంట్ కూడా లభించలేదనే వార్తలు వచ్చాయి. ఆయనను తగిన విధంగా గుర్తించడం లేదనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అయితే, ఆయన ప్రాధాన్యం ఏమీ తగ్గలేదని అంటున్నారు. చిరంజీవికి పార్టీ పదవి ఇవ్వాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, చిరంజీవి మాత్రం కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూన్‌లో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. ఈ విస్తరణలో ప్రజారాజ్యం పార్టీకి చెందినవారికి మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు. ఏమైనా, చిరంజీవి భవిష్యత్తు ఇంకా డోలాయమానంలోనే ఉంది.

English summary
It is learnt that Prajarajyam party leader Chiranjeevi may ne inducted into Congress core committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X