వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మన్మోహన్ సింగ్‌పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు రుసరుస

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
న్యూఢిల్లీ: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తీరుపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రుసరుసలాడారు. రైతు సమస్యలపై ప్రధానికి పట్టడం లేదని ఆయన విమర్శించారు. రైతు సమస్యలపై ఆయన మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌ను కలిశారు. నాలుగు సార్లు అడిగినా ప్రధాని మన్మోహన్ సింగ్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆయన అన్నారు. దీన్ని రైతుల పట్ల ప్రధానికి ఎంత ప్రేమ, అవగాహన, బాధ్యత ఉందో అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

రైతులకు కొంత మేరకైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో తాను వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌ను కలిసినట్లు ఆయన తెలిపారు. మహానాడు ఉన్నా తాను శరద్ పవార్‌ను కలవడానికి వచ్చానని, రైతు సమస్యలను గుర్తించే తాను ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

English summary
TDP president N Chandrababu Naidu expressed unhappy with the attitude of PM Manmohan singh on farmers issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X