చిరంజీవికి లైన్ క్లియర్ చేయడానికే బొత్సకు పిసిసి పదవి ఇస్తున్నారా!
అంతేకాదు తెలంగాణలో అదే సామాజిక వర్గానికి చెందిన వి హనుమంతరావు, కె కేశవరావు వంటి నేతల ప్రాధాన్యత కూడా తగ్గవచ్చు. ఈ నేపథ్యంలో చిరు ఎంట్రీ ఎవరికీ నచ్చదనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన బొత్సకు చిరు ఎంట్రీ షాక్కు గురి చేసేదే. వీరెవరూ చిరు ఎంట్రీని ఆమోదించే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే పార్టీ అధిష్టానం వారికి ముఖ్యమైన పదవులు ఎరవేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే బొత్స సత్యనారాయణ పేరు పిసిసి అధ్యక్ష పదవికి వినిపిస్తుంది. బొత్స దారిలోనే వట్టి, కన్నలను కూడా ప్రాధాన్యత ఉన్న పోస్టులలో కూర్చుండ బెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పదవులతో వారిని ఇప్పటి నుండే తమ దారిలోకి తెచ్చుకోవడం ద్వారా ముందు ముందు చిరంజీవిపై వారి వ్యతిరేకత తగ్గించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమలోని పలు జిల్లాల్లో కాపు, తెలగ, మున్నూరు కాపుల ప్రభావం ఎక్కువ. వారందరినీ కాంగ్రెసు వైపుకు రప్పించుకోవాలంటే చిరంజీవిని దరి చేర్చుకోవడమే ఉత్తమమని భావించిన పార్టీ ఆ దిశలో అడుగులు వేసి సక్సెస్ అయింది. అయితే ఇప్పటికే పార్టీలో ఉన్న సదరు సామాజిక వర్గం నేతలు వారి వారి జిల్లా, నియోజకవర్గాల్లో ప్రాధాన్యత. మరికొందరికి ఫాలోయింగ్ ఏమాత్రం లేదనే చెప్పవచ్చు. అలాంటి నేతలను నమ్మకోవడం కంటే చిరంజీవిని నమ్ముకోవడం ఉత్తమమని భావించిన కాంగ్రెసు పీఆర్పీని కాంగ్రెసులో విలీనం చేసుకొని 2014 సిఎంగా చిరంజీవిని తెరపైకి తెచ్చే వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది.